NTR: విజయవాడ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పునూరు గౌతమ్ రెడ్డి జెండా ఆవిష్కరించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.