VSP: నక్కపల్లి మండలం గొడిచెర్ల పీహెచ్సీలో ఓపీ పెంచి సకాలంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు వార్డులను పరిశీలించారు. భవనంలో కొన్ని చోట్ల బీటలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆమె సూచించారు.
కృష్ణా: పామర్రు మండలం బలిపురం గ్రామం NH–65 వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా, రోడ్డు భద్రత అవగాహన ఫ్లెక్సీను పోలీసులు మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ శుభకర్ మాట్లాడుతూ.. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జాతీయ రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.
SKLM: డా బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో NSS ఆధ్వర్యంలో వచ్చే నెల 5న వికసిత్ భారత్ యువపార్లమెంట్-2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీసీ రజని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అడ్డయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ , మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ ఉన్నారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రసూల్ తెలిపారు. పట్టణంలోని విరువూరు రోడ్డు, ఎర్ర చేలు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాలలో కరెంట్ నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 25న జీల్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఉద్యోగ ఎంపికలు నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ నరసింహారావు తెలిపారు. ఏదైనా డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.18 నుంచి రూ.20 వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు 9912046234, 9849712739లను సంప్రదించాలన్నారు.
ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
AKP: అనకాపల్లి దేవుని గుమ్మంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బి. శ్రీనివాసరావు, ఈవో చంద్రతేజ తెలిపారు. 27 ఉదయం ధ్వజారోహణ, రాత్రి కళ్యాణ మహోత్సవం, 28న అన్న సమారాధన జరుగుతుందన్నారు. మార్చి1న అర్ధ ఏకాహం, 2న గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.
NDL: నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
TPT: ఫిబ్రవరి 28న తిరుపతిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రవేశం ఉచితం, కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. నమోదు కోసం https://linktr.ee/rsctpt లింక్ను సందర్శించాలన్నారు.
కర్నూలు బళ్లారి చౌరస్తా బైపాస్లో జరుగుతున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మలుపు వద్ద రెండు షాపులను తొలగిస్తామని, పోలీస్ అనుమతి రాగానే పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని కమిషనర్ తెలిపారు.
E.G: రాజమండ్రిలోని ప్రతి నిర్మాణానికి ఆస్తి పన్ను విధించాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్, మెక్ డొనాల్డ్స్, ప్రకాశ్ నగర్ భవనాలను తనిఖీ చేశారు. నిర్మాణ విస్తీర్ణానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోందా లేదా అన్నది కొలతలు వేసి తనిఖీ చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
ATP: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్లో ఖాళీగా ఉన్న 16 పాయింట్స్మెన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎండీ రజాక్ తెలిపారు. అర్హులైన మాజీ సైనికులు వచ్చే నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనంతో పాటు ఇతర భత్యాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
W.G: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
NTR: విజయవాడలో నిర్వహించిన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు, క్రీడలు ఒక ఆటవిడవుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నానికి చెందిన సీహెచ్. సునంద ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన 45వ జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొని, 3వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జిల్లా కలెక్టర్ క్రీడాకారిణి సునందను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని బుధవారం ఆకాంక్షించారు.