సత్యసాయి: ధర్మవరం గాండ్లవీధికి చెందిన చింతా చిన్న కొండన్న (36) రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. విశ్వదీప సేవా సంఘం అవగాహనతో తల్లి శకుంతలమ్మ, భార్య గీతాంజలి డొనేషన్కు అంగీకారం తెలిపారు. విజయవాడ ఎల్వీ ప్రసాద్ నేత్రాలయ టెక్నీషియన్ ప్రసాద్ నేత్ర కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది.