కృష్ణా: మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ పరిసరాలను శుక్రవారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.