తూ.గో: సీతానగరం మండలం పురుషోత్తపట్నం సత్యసాయి పథకం ద్వారా గోదావరి జలాల సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం, రాపాక, బుచ్చింపేట, కృష్ణునిపాలెం సహా 15 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు.