కోనసీమ: అమలాపురం మండలంలోని 22 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని ఎంపీడీవో బాబ్జి రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, విద్యాశాఖ అధికారులను పలు గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారన్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో పాలన సాఫీగా సాగేందుకు ఈ అధికారులను నియమించినట్లు తెలిపారు.