KRNL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే వీరుపాక్షి సోదరుడు బుసినే మారెప్ప అనారోగ్యంతో ఇవాళ చిప్పగిరిలో కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే MLA వీరుపాక్షి అక్కడికి చేరుకుని ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మారెప్ప మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల వైసీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.