నూజివీడు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ పాఠశాలలో 9,10 తరగతుల విద్యార్థినులు గురువారం స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో ట్రైనింగ్కు వెళ్లారు. కంప్యూటర్ నిపుణుల ద్వారా అనేక అంశాలు, బ్యూటిషన్, హెల్త్ టిప్స్లపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఏ జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి, ట్రైనర్స్ రంజిత, సల్మా, హెచ్ఎం సుధారాణి పాల్గొన్నారు.
ATP: గుంతకల్లులో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. స్థానిక ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ ఆధ్వర్యంలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి విశాఖపట్నం వస్తున్న బస్సు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.
NDL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అత్యున్నత క్రీడా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు కోరారు. 2025 సంవత్సరానికి గానూ మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు అర్హులైన క్రీడాకారులు 28 తేదీలోపు www.dbtyas-sports.gov.in అప్లై చేసుకోవాలన్నారు.
GNTR: రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న బనవతు శ్యామి నాయక్ (42) కనబడటం లేదని తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గత 10 రోజులుగా తన భర్త కనిపించడం లేదని భార్య వెంకటరమణ బుధవారం ఫిర్యాదు చేశారని ఎస్సై ఖాజావలి తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. గురువారం ఉదయం 676 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎగువ కర్ణాటక నుంచి కొనసాగుతోందని జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1655అడుగులు కాగా ప్రస్తుతం 1652 అడుగుల మేర నీరు వచ్చి చేరిందన్నారు.
విశాఖ నగరంలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న 129 మంది రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ రైతు కార్డులను మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రైతుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఈ కార్డులను అందించారు.
SKLM: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు బుధవారం శాసనసభ ప్రాంగణంలో తనకు కేటాయించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పూజలు నిర్వహించి, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కార్యాలయాన్ని పరిశీలించారు. కొద్దికాలం క్రితం కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని కల్పించిన విషయం తెలిసిందే.
E.G: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన జాలపర్తి రాజు బుధవారం పొలం దుక్కు దున్నడానికి లక్ష్మీపురం – పల్లంట్ల రోడ్డులో ట్రాక్టర్పై వెళుతుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రాజు పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మన్యం: ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మండలం మరికి గ్రామంలోకోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం అన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను మేధావులంతా వ్యతిరేకించాలి అన్నారు.
E.G: జిల్లా ప్రజలు భయపడకుండా క్యాన్సర్ నిర్ధారణ చికిత్స కోసం రాజమండ్రిలోని ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్(GTGH)లో, అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 కేజీల భారీ ట్యూమర్ క్యాన్సర్ ఆపరేషన్ బుధవారం విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.
SKLM: ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు స్థానిక పాఠశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాలు, పరికరాలు, చట్టాలు పై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశం మేరకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
NLR: ఓ వైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత గ్రామాలైన మైపాడు, గంగపట్నం, రామతీర్థంలలో సైక్లోన్ షెల్టర్లను తుఫాను బాధితుల కోసం సిద్ధం చేయాలని కోరారు.
ATP: తాడిపత్రి పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ సమీప ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ముఖంపై సిమెంట్ దిమ్మతో బాది హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
KDP: దువ్వూరు మండల పరిధిలో ఉల్లి పండించే రైతులు ధరలు లేక అష్టకష్టాలు పడుతుంటే, అకాల వర్షాలు వారిని మరింత నట్టేట ముంచాయి. ప్రభుత్వానికి, మీడియాకు రైతుల కష్టాలు ఇప్పుడు కనపడటం లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని వారు కోరుతున్నారు.