ELR: మండూరు, వేగివాడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగివాడ నుంచి ఏలూరు వైపు వస్తున్న ఆటో చక్రాయగూడెం వద్ద పామ్ ఆయిల్ తోటలోకి దూసుకువెళ్ళింది. ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.