తూ.గో: జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా శ్రీక్షితిజ్ ఆదిత్య శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి విధులకు రిపోర్ట్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా అందాలని, ప్రజలకు జవాబుదారితనం, పారదర్శకతతో సేవలందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆయనకు దిశానిర్దేశం చేశారు.