KKD: పిఠాపురంలో ఇంటి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేందుకు మరో రెండు రోజులే సమయం ఉందని కమిషనర్ కనకారావు సోమవారం తెలిపారు. ఈ నెల 30 లోపు పన్ను చెల్లిస్తే పాత బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ, ప్రస్తుత పన్నుపై 5% రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిస్తే రాయితీలు వర్తించవన్నారు.