AKP: ఎలమంచిలిలోని పెంజెరువు పరిరక్షణకు మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. కమిషనర్ ప్రసాద్ రాజు ఆదేశాలతో చెరువు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చెరువులో చెత్త, వ్యర్థాలు వేస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని శానిటైజేషన్ సెక్రటరీ ఆశీర్వాద్ తెలిపారు. ప్రజలు సహకరించాలని సెక్రటరీ కోరారు.