అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా 60 మంది దివ్యాంగులకు రూ.60 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. జీవనోపాధి మెరుగుదలకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు.