• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రాష్ట్ర హోంమంత్రి సేవలు ఎనలేనివి’

AKP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోరాడ చందర్రావు మంగళవారం నక్కపల్లిలో అభినందనలు తెలియజేశారు. పాయికరావుపేట నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కొనియాడారు. ప్రజలందరూ ఆమె సేవలను ఎన్నడూ మర్చిపోరని పేర్కొన్నారు.

March 24, 2026 / 12:01 PM IST

అంగన్వాడీ పోస్టులకు నోటీఫికేషన్ విడుదల

PLD: నరసరావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ కాంతా కుమారి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల 2 పోస్టులు, సహాయకురాళ్ల 7 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మహిళలు అర్హులని తెలిపారు.

March 24, 2026 / 12:01 PM IST

‘భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శ్రీ బసవతారకం ఐటిఐ కళాశాలలో మంగళవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నాయకులు, విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా DYFI నాయకులు శ్రీను మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని సూచించారు.

March 24, 2026 / 12:00 PM IST

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన నెలివాడ గ్రామస్తులు

SKLM: రణస్థలం మండలం నెలివాడ జంక్షన్ నుంచి చిల్లపేట రాజాం పంచాయతీ వరకు రూ.2.75 కోట్ల రూపాయల నిధులతో తారు రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును గ్రామ ప్రజలు, కూటమి నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

March 24, 2026 / 12:00 PM IST

జాతర మహోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామంలో జరగనున్న శ్రీ ధనమ్మ తల్లి, పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల గోడపత్రికలను అమలాపురంలోని క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 24, 2026 / 12:00 PM IST

టంగుటూరులో పర్యటించిన మంత్రి

ప్రకాశం: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకాశం జిల్లాలో మంగళవారం పర్యటించారు. మంత్రికి ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య శాలువ, పూలమాలతో సన్మానించి స్వాగతం పలికారు. మంత్రి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని దామచర్ల సత్య కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 24, 2026 / 11:58 AM IST

పెట్రోల్ దొరకక ప్రజల ఇబ్బందులు

NTR: కంచికచర్ల పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రమైంది. బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. గంటల తరబడి వేచి చూస్తున్నా పెట్రోల్ దొరకక వాహనదారులు, విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ‘నో స్టాక్’ బోర్డులతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

March 24, 2026 / 11:56 AM IST

రేపు కనిగిరికి రానున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ప్రకాశం: ఆర్&బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనిగిరి నియోజకవర్గానికి రానున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి పరిశీలించనున్నారు. వెలిగండ్ల మండలంలో రూ.1.85 కోట్ల వ్యయంతో నిర్మించిన గన్నవరం వంతెనతో పాటు కనిగిరి మండలంలో నిర్మించిన నూతన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించనున్నారు

March 24, 2026 / 11:56 AM IST

‘క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి’

ATP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా గుత్తిలో టీబి యూనిట్ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ..ప్రజలందరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక వారం నుంచి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఉమ్ము పరీక్ష చేయించుకొవాలన్నారు.

March 24, 2026 / 11:55 AM IST

కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా..?

చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన తిరుపతి (R), కురబలకోట పరిసరాలతో కొత్త నియోజకవర్గాలు, పలమనేరు-కుప్పం పరిధిలో వీకోట, వాయిల్పాడు, పూతలపట్టు-చిత్తూరు ప్రాంతాలతో కొత్త సెగ్‌మెంట్లు ఏర్పడే అవకాశం ఉంది. సోమల కేంద్రంగా పుంగనూరు సౌత్, శ్రీకాళహస్తి-సత్యవేడు మండలాలతో మరో నియోజకవర్గ ఛాన్స్ ఉంది.

March 24, 2026 / 11:54 AM IST

సాధకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మంత్రి

GNTR: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సాధకులతో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో ప్రథమ స్థానాన్ని సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో టాప్-5లో నిలిచేలా కృషి చేసిన సాధకులందరికీ అభినందనలు తెలిపారు.

March 24, 2026 / 11:54 AM IST

కన్నుల పండువగా వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం

విశాఖ: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.

March 24, 2026 / 11:48 AM IST

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న బైక్

ELR: ఏలూరు మండలం వట్లూరు సమీపంలోని జాతీయ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాహనదారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 24, 2026 / 11:38 AM IST

ప్రమాద స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ అధికారులు

పల్నాడు: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారులు చేరుకున్నారు. ప్రాంతాన్ని APFSL అసిస్టెంట్ డైరెక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు క్లూస్ టీమ్తో పాటు జాగిలం(సింబా)తో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు.

March 24, 2026 / 11:33 AM IST

పన్ను చెల్లించని దుకాణాలను సీజ్ చేసిన అధికారులు

ATP: గుత్తి పట్టణంలోని ఇలాహి షాదీ ఖానా వద్ద గల కాంప్లెక్స్ పన్ను బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీ అధికారులు మంగళవారం 8 దుకాణాలను సీజ్ చేశారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. 3 సంవత్సరాల పన్ను బకాయి రూ.1,90,000 ఉండడంతో ఎనిమిది షాపులను సీజ్ చేశామన్నారు. సకాలంలో ఇంటి మరి దుకాణాల పనులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు కోరారు.

March 24, 2026 / 11:33 AM IST