• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోలార్ బోర్ రీప్లేస్ చేయాలంటూ ఖాళీ బిందెలతో నిరసన

అల్లూరి: పాడైన సోలార్ బోర్ రీప్లేస్ చేయకపోవడంతో బురద నీరు వాడుతున్నామని అరకులోయ(M) బస్కి పంచాయితీ కంజరితోట గ్రామస్తులు తెలుపుతూ వాపోయారు. మంగళవారం పాడైన బోరు వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సోలార్ బోర్ రీప్లేస్‌కు పంచాయితీ నుంచి జిల్లా స్థాయి వరకు వినతులు ఇచ్చినా చర్యలు లేవన్నారు. ఇదే కొనసాగితే ఎంపీడీఓ ఆఫీస్ వద్ద బిందెలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

March 24, 2026 / 10:28 AM IST

ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

KRNL: గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో ఇవాళ ట్రాక్టర్ ప్రమాదంలో సాదిక్ బాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. బావి తవ్వకాల్లో భాగంగా మట్టిని తరలిస్తుండగా, ట్రాక్టర్ ట్రాలీకి అనుసంధానమైన ఇనుప రాడ్ విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. ట్రాక్టర్ నుంచి దూకే సమయంలో తలకు గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

March 24, 2026 / 10:25 AM IST

మద్యం లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం..!

అన్నమయ్య: కడప-రేణిగుంట హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప నుంచి రైల్వేకోడూరుకు మద్యం లోడ్తో ఓ మినీ లారీ బయలుదేరి నందలూరు మండలంలోని ఆల్విన్ కర్మాగారం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మద్యం బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే వాటిని మరో వాహనంలోకి మార్చి తరలించారు.

March 24, 2026 / 10:25 AM IST

తిరుపతి ఎకనామిక్ రీజన్‌పై ప్రత్యేక దృష్టి

తిరుపతి ఎకనామిక్ రీజన్ (TER) అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. TER కోసం సమగ్ర ప్రాంతీయ ప్రణాళిక రూపొందించేందుకు నిపుణుల సంస్థ ఎంపికకు RFP విడుదలకు అనుమతి ఇచ్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్‌ను Dy. CEOగా నియమించి, మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆఫీసుగా నిర్ణయించారు. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేసి, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.

March 24, 2026 / 10:25 AM IST

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ

సత్యసాయి: జిల్లాలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు లభించాయి. సంస్థపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిందని సాకే వినయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విజయం ప్రజలు, నాయకుల పోరాట పటిమ వల్లే సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనుమతులు రావడంతో ఇక నుంచి ఆర్డీటీ సేవలు పేదలకు యథావిధిగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

March 24, 2026 / 10:23 AM IST

జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు..!

KDP: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.

March 24, 2026 / 10:22 AM IST

కాసులను కురిపించిన చేపలు..!

W.G: జిల్లా నరసాపురం మత్సకారులు సముద్రంలోకి వేటకి వెళితే రెండు కచిడి చేపలు పడ్డాయి. వాటిని అంతర్వేది హార్బార్‌కు తరలించి వేలం వేశారు. 35 కేజీల చేప రూ 1.2 లక్షలు పలకగా 30 కేజీల చేపరూ 74 వేలు పలికింది. ఇవి రెండు ఆడ చేపలు. అవే మగవైతే రూ. 4 లక్షలు పైగా ధర పలుకుతాయి అని వ్యాపారులు చెబుతున్నారు.

March 24, 2026 / 10:20 AM IST

నిర్లక్ష్య డ్రైవింగ్‌.. ఒకరు మృతి..!

KRNL: కృష్ణగిరి(M) ఎరుకలచెరువు సమీపంలో నాపరాతి బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో బేతంచెర్ల మండలం గోర్లగుట్టకు చెందిన బూడిది నాగప్రసాద్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం SI కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

March 24, 2026 / 10:18 AM IST

గ్యాస్ సెగ.. చికెన్ మంటలు..!

WG: జిల్లాలో హోటల్ యజమానులు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు. ఒకపక్క కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడగా, మరోపక్క ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఆదివారం రూ. 340గా ఉన్న కిలో చికెన్ ధర, ఒక్కసారిగా రూ. 400 దాటడంతో నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టాలు చూడాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 24, 2026 / 10:17 AM IST

జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా సతీష్

విశాఖ: రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ ఛైర్మన్‌ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు వనం రెడ్డి సతీష్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతంలో ఆయన చురుకుగా పని చేసి, అధినేత పవన్ కళ్యాణ్‌తో సమన్వయం కొనసాగిస్తున్నారు. దీంతో అతనికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

March 24, 2026 / 10:13 AM IST

బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: కలెక్టర్

కృష్ణా: బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్య వివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.

March 24, 2026 / 10:13 AM IST

కాలువలు క్లీన్ కాక.. వీధుల్లోకి మురుగు వరద

విజయనగరం: రావివలస గ్రామంలో మురుగు కాలువలు క్లీన్ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగి వస్తోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలోకి మురుగు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, దుర్వాసనతో జీవనం కష్టమైందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు

March 24, 2026 / 10:12 AM IST

ఉమ్మడి జిల్లాలో 25 ఎమ్మెల్యే స్థానాలు..?

GNTR: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, 25కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 24, 2026 / 10:06 AM IST

ముమ్మిడివరంలో గ్యాస్ కోసం పడిగాపులు

కోనసీమ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన కారణంగా ముమ్మిడివరంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం బుక్ చేసినా గ్యాస్ అందడం లేదని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నామన్నారు.

March 24, 2026 / 10:04 AM IST

‘డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు’

విజయనగరం: జిల్లాలో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జే.సీ.ఎస్.సేధు మాధవన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా సోమవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధం అన్నారు.

March 24, 2026 / 10:02 AM IST