SKLM: భార్యను తుపాకీతో చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం జడ్జి కె. కిషోర్ బాబు తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మెళియాపుట్టి M భరణికోటకి చెందిన ఎస్ .పద్మను భర్త జగ్గారావు 2021 లో నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు SP తెలిపారు.