గుంటూరు: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు విధానంపై పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉత్తమ వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.