VZM: ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లాడ్స్ పనుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపీ నిధులతో మంజూరైన పనులు వివిధ దశల్లో పెండింగ్ ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.