ASF: ఈ నెల 30వ తేదీన HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో TPTF ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర విద్య సదస్సును విజయవంతం చేయాలనీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం లింగాపూర్ మండలం కంచన్ పల్లి గ్రామంలో సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. విద్యారంగ సమస్యలతో పాటు సామజిక సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారన్నారు.