కోనసీమ: రాయవరం మండలం చెల్లూరులోని పురాతన అగస్తీశ్వరస్వామి ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన నిందితుడు మల్లేష్కు గురువారం కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 13న నిందితుడు ఆలయంలోని హుండీని పగలగొట్టి రూ.5వేల నగదుతో పాటు సీలింగ్ ఫ్యాన్ను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.