బాపట్ల జిల్లాలో రేషన్ మాఫియా యథేచ్ఛగా సాగుతుండటానికి జిల్లా అధికారులు వైఫల్యమే కారణమని BSP బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు ఆరోపించారు. పేదలకు చెందాల్సిన బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేషన్ అక్రమాలను అరికట్టడంలో DSO పూర్తిగా విఫలమయ్యరని పేర్కొన్నారు.