కృష్ణా: నాగాయలంక సాయిబాబా గుడి వద్ద గురువారం కూలీల ట్రాక్టర్ బోల్తా పడి పది మందికి గాయాలపాలయ్యారు. ప్రమాద బాధితులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులందరూ నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.