E.G: సీతానగరం మండలంలో కాతేరు నుంచి సీతానగరం వరకు నిర్మించిన సీసీ రోడ్డుపై ఎటువంటి ఆక్రమణలు చేయవద్దని కోరుకొండ సీఐ వివిఎస్ మూర్తి బుధవారం హెచ్చరించారు. రోడ్డుపై ధాన్యం, మొక్కజొన్నలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదానికి కారణమైన వారిపై ఇప్పటికే FIR నమోదు చేసినట్లు తెలిపారు.