KRNL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన AP-AIMS యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఏవో సురేశ్ బాబు రైతులకు సోమవారం సూచించారు. ఈ యాప్ ద్వారా పంట వివరాలు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు వంటి వ్యవసాయ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో తమ రైతు విశిష్ఠ సంఖ్యను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ELR: గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చడంలో జలజీవన్ మిషన్ పథకం ఒక గొప్ప వరం లాంటిదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరులో రూ.65.10 లక్షల రూపాయల జల్జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఓవర్ హెడ్ రిజర్వాయర్ సిస్టం పనులకి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ప్రజలకు త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(SDC)గా శ్రీకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనిచేస్తానని తెలిపారు.
కోనసీమ: నక్కపల్లిలో జరుగుతున్న ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ విచ్చేసారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశాఖపట్నం పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలుపై చర్చించారు.
KDP: అక్కంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై టి. సుండుపల్లి మండలంలో టిడిపి ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తక్షణ స్పందన తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చారు. సమస్య త్వరగా పరిష్కారమవుతుందని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
W.G: ఆకివీడు మండలంలోని పేకాట స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు. దుంపగడపలో ఐదుగురిని అరెస్టు చేసి రూ.7,800, సిద్దాపురం శివారులో నలుగురిని పట్టుకుని రూ.6,200 స్వాధీనం చేసుకున్నట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు వివరించారు.
అన్నమయ్య: కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామం వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ. 7,500 నగదు, 4 బైకులు, 3 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం HP పెట్రోల్ బంక్ వద్ద ఇవ్వల రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించని డ్రైవర్ బస్సును ఆ వ్యక్తి తలపై నుంచి పోనివ్వడంతో అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సోమవారం పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న హత్యలు, మహిళలపై నేరాల కేసులను సమీక్షించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ పెంచి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని, ప్రజలకు భద్రతా భావం కల్పించాలని అధికారులకు సూచించారు.
VZM: గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ లాభాలు పొందుతున్నట్లు బయటపడింది. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలపై లీగల్ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టగా.. 3 చోట్ల తక్కువ బరువు సిలిండర్లను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ డిప్యూటీ కంట్రోలర్ తెలిపారు.
VSP: విశాఖకు చెందిన ధర్మాల మాధవరావు(57) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కాగా, ఆయన కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆయన నుంచి సేకరించిన లివర్, కిడ్నీ, రెండు కళ్ళతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ కో- ఆర్డినేటర్ డా. రాంబాబు సోమవారం ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను అభినందించారు.
E.G: బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. రాజమండ్రిలోని బీసీ కళాశాల బాలికల హాస్టల్ను MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు పరిశీలించారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.
మార్కాపురం జిల్లా నూతన పోలీస్ కార్యాలయ నిర్మాణానికి స్థల ఎంపికలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం రాయవరం సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. భూమి అనుకూలత, రవాణా సౌకర్యాలు, భద్రతా అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.
సత్యసాయి: గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్ సీపీఎం కాలనీలో తాగునీరు, కరెంట్ సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ను కలిసి 110 అర్జీలు సమర్పించారు. సమస్యను పరిశీలించిన ఆర్డీవో సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటివరకు రోజుకు రెండు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.
అన్నమయ్య: పీలేరు మండలం బోడుమల్లువారి పల్లి పంచాయతీలో “అన్నదాత సుఖీభవ”, “పీఎం కిసాన్” లబ్ధిదారులతో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురం రామ్మూర్తి, డైరెక్టర్లు రవి, కిషోర్, క్లస్టర్ ఇంఛార్జ్ వెంకటరత్నం, ఐటీ టీడీపీ ప్రతినిధి వెంకటరమణారెడ్డి, అగ్రికల్చర్ అసిస్టెంట్ హిమబిందు తదితరులు హాజరయ్యారు.