NTR: నందిగామలో అర్చకుడు సాయిరాం నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచాడు. రాగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు బ్యాగును గొల్లమూడి శివాలయ అర్చకుడు సాయిరాం రోడ్డుపై గుర్తించాడు. వెంటనే సమాచారం ఇచ్చి, పోలీసుల సమక్షంలో యజమానికి నగదు అందజేశాడు. పోయిందనుకున్న డబ్బు తిరిగి రావడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.