ప్రకాశం: తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పర్యటించారు. గ్రామపంచాయతీ రిక్షాలు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లే విధంగా ఉండాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.