KRNL: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు వెల్దుర్తిలో నేటీతో 2వ రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్మికులు దీక్షలను కొనసాగిస్తున్నారు. 2వ రోజు దీక్షలను చిన్న వ్యాపారస్తుల కర్నూలు కమిటీ సభ్యుడు రామాంజనేయులు ప్రారంభించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
KRNL: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 101వ రోజుకు చేరాయి. జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, అశోకానంద రెడ్డి, రఘురామయ్య, కృష్ణమూర్తి, కమతం వెంకటేష్ దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని JAC నాయకులు డిమాండ్ చేశారు.
BPT: వైద్య ఖర్చులకు పేదలు అప్పుల పాలు కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం రేపల్లె క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ.19.09 లక్షల విలువైన చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.
SKLM: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు మంగళవారం సందర్శించారు. మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలిగాంలో ఆదిత్య కళాశాల పరీక్షా కేంద్రాలను కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్సై కె.కృష్ణ ప్రసాద్లు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
KRNL: పెద్దకడబూరులో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. రూ.1.90 కోట్ల వ్యయంతో 3.O కింద, NREGS పథకం మెటీరియల్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించాయి. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకంతరెడ్డి భూమిపూజ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: కూటమి ప్రభుత్వం హార్టికల్చర్కు ప్రోత్సాహంగా అరటి తోటలకు పండ్ల కవర్లపై 50% సబ్సిడీ ప్రకటించింది. రాజంపేటలో సుమారు 5,000 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. రైతులు కవర్లు కొనుగోలు చేసి బిల్లులు ఉద్యాన శాఖకు సమర్పిస్తే ఎకరాకు రూ.10 వేలు రాయితీ అందుతుంది. గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు, అంటే రూ.25 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని అధికారులు తెలిపారు.
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ నేత లక్ష్మీనారాయణ రెడ్డి మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, స్వామివారి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరిని పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్.మనోజ్ రెడ్డి మంగళవారం ఉదయం నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 17వ డివిజన్లో టీజీపీ పార్కును సందర్శించి పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 15వ డివిజన్లో ఏర్పాటు చేయనున్న సాగర్ కాలనీ పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
NTR: సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబు ఆదేశాలతో ధర్నా చౌక్ మీదగా వచ్చేవారు, అలంకార సెంటర్ మీద నుంచి గాంధీనగర్ వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్సై సరళ, ఎఎస్సై మెహర్ బాబు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
కృష్ణా: రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చేయటం ముదావహం అని టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాకు మచిలీపట్టణంకు చెందిన స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంబేగ్ చొరవతో దాతలు రూ.15వేలు విలువైన బియ్యం, సరుకులు అందచేశారు. మోర్ల శివ, షేక్ నబీఘోరీ, అమీర్ జానీ పాల్గొన్నారు.
ATP: రామాయణాన్ని వర్లి చిత్రకళ ద్వారా వినూత్నంగా చిత్రీకరించిన డాక్టర్ ఎం.వరలక్ష్మి, సాయి దీపికలను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. వర్లి ఆర్ట్ నుంచి తెలుగు అక్షరమాలతో రామాయణాన్ని సృజనాత్మకంగా రూపొందించినందుకు వీరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. పాపంపేటకు చెందిన వీరిద్దరూ సాధించిన మెడల్స్, జ్ఞాపికలను చూసి ఎమ్మెల్యే ప్రశంసించారు.
NLR: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై నెల్లూరు ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో రూ.వందల కోట్లు సంపాదించి.. నమ్ముకున్న క్యాడర్ను వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు. స్రవంతి మేయర్గా ఉన్న సమయంలో ఆమెను సిటీ నియోజకవర్గంలోని రానీయకుండా మూడేళ్లు అనిల్ అడ్డుకున్నారని ఆరోపించారు.
GNTR: తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మంగళవారం చెంచుపేట వైపు నుంచి మార్కెట్ వైపు వస్తున్న ఓ కారు రాంగ్ రూట్లో రావడంతో, వంతెనపై దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రాంగ్ రూట్ రాకపోకలను అరికట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ వాడకం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని అన్నారు.
KRNL: హొళగుంద మండల కేంద్రంలో రేపు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు SR ఫంక్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కన్వీనర్ షఫీ ఉల్లా కోరారు.