బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల విన్నపాలను స్వీకరించారు. వాటిని చట్టపరంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.