కోనసీమ: మహిళలకు ఉపాధి కల్పించడంలో భాగంగా సముద్రపు నాచు పెంపకానికి కార్యాచరణ రూపొందించాలని జేసీ నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో శాస్త్రవేత్తలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో 5 గ్రామాల చొప్పున ఎంపిక చేసి 20 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.