కృష్ణా: నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో బాలుడు బాలాజీ, వృద్ధురాలు లక్ష్మీ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసుపై దృష్టి సాధించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఇవాళ సందర్శించి, దర్యాప్తు బృందాలతో మాట్లాడారు. నిందితుల ఆచూకీ కోసం మూడు బృందాలతో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు.