ప్రకాశం: ఒంగోలు నగరంలో ఇప్పటివరకు 50 డివిజన్లు ఉండగా 66కు పెరగనున్నట్లు తెలుస్తుంది. వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత జనాభా 3.10 లక్షల మందిగా ఉన్నారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్య పెరగనుంది. దీంతో ఒంగోలును 66 డివిజన్లుగా పునర్విభజించనున్నారు.