KDP: దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తాలక్ష్మిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్యకు వినతిపత్రం సమర్పించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి బాధితులు న్యాయం కోసం ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు వెళ్లాలంటే అధిక వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.