SRD: ఝరాసంగం మండలంలోని 288 మంది వార్డు సభ్యులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మంజుల తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో తొలి విడత ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డు సభ్యులు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు చేరవేయాలని, గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.