PDPL: ముత్తారం మండలం పారుపల్లి పంచాయతీ శాత్రాజ్ పల్లి గిరిజన ఆవాసంలో ఏళ్ల తరబడి నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎన్నికల హామీలో భాగంగా సర్పంచ్ చొప్పరి సంపత్ బోరు బావి వేయించారు. మాజీ జడ్పీటీసీ నాయినేని జగన్మోహన్ రావు కొబ్బరికాయ కొట్టి దీనిని ప్రారంభించారు. బోరు సక్సెస్ కావడంతో శాత్రాజ్ పల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.