NTR: తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఏపీఎస్ఎస్ డీ.సీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై జ్యోతి ప్రజ్వలన వెలిగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు ఉపయోగకరమన్నారు. కావున విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. మేళాలో 736 మంది పాల్గొన్నారు.