సత్యసాయి: జిల్లాలో ఐదేళ్లకు పైగా ఒకే స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లకు రెండో రోజు బదిలీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ ప్రక్రియలో 20 మంది ఏఎస్సైలు, 51 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.