E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వై. మేఘా స్వరూప్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అటువంటి మహనీయుల జీవితం నుంచి స్పూర్తి పొందాలని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.