కృష్ణా: గ్రామీణ వైద్య రంగం బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం మోపిదేవి మండలం వెంకటాపురంలో రూ. 36 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. 14 నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.5.04 కోట్లు, 15 అసంపూర్తి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.1.36 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు.