VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మొత్తం 37 ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 7 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు.