NZB: బాల్కొండలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం మాసపూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్యస్వామి, శ్రీచక్రం, అయ్యప్పస్వామిలకు అభిషేకాలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ముప్కాల్ వాస్తవ్యులు తిమ్మాన్నగారి లాస్య శ్రీనివాస్ అన్నదాన సత్రానికి విరాళం అందించారు.