KRNL: ఆదోని అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మునిసిపల్ కమిషనర్ నహిమ్ హమద్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన తనిఖీలలో టిఫిన్ రుచిగా ఉండాలని, చట్నీ పల్చగా ఉండకూడదని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపయోగించిన ప్లేట్లను వేడి నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.