సత్యసాయి: వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బిల్లా కుమార్ను కనగానపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఇతడు, ఈ నెల 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై మహమ్మద్ రిజ్వాన్, నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు.