CTR: పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ మిట్టమీద రాచ పల్లెలో కొలువైన కోదండ రామస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమం నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు అనంత కుమారాచార్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.