NTR: ‘వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందన్నారు. పిల్లలను అక్కడే చేర్పించాలని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులను కోరారు.