NTR: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ త్రీ ట్రాఫిక్ పోలీసులు మానవత్వం చాటుతున్నారు. రోడ్ల వెంట దాహంతో అలమటిస్తున్న గోవులు, కుక్కలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సీఐ సుధాకర్ సూచనలతో పలు ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయగా, ఏఎస్ఐ మెహర్ స్వయంగా గోవులకు నీరు అందించారు. సిపి ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.