ATP: నగరంలోని రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని కాలనీ ప్రజలతో ఆరా తీశారు. కాలనీలోని ప్రతి గడపగడపకు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీవాసులు చెప్పిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.