తడి చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఇవాళ నంద్యాల మండలం పొన్నాపురం కాలనీలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా రూ.17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.