కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నేస్తం-బడికి రా! ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పది మంది విద్యార్థులను 6వ తరగతిలో అడ్మిషన్లు ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే ఇద్దరికి 7వ, 8వ తరగతిలో అడ్మిషన్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కందుల సుజాత, పీ.వెంకటేశ్వరరావు, హెచ్ఎం కే.ఏడుకొండలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.