E.G: రాజమండ్రిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇంచార్జ్ బి.పద్మ మంగళవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదుల నుంచి సంబంధిత కేసుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అన్ని కేసులు సత్వర పరిష్కారం కావాలన్నారు.