కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వేదాంతం ఆయిల్ కంపెనీ వద్ద నిరుద్యోగులు ఆందోళన ఉదృతం చేశారు. గత నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నా స్పందన లేకపోవడంతో ఇవాళ కంపెనీ జీఎం మనుకున్నా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఇస్తానన్న 100 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.