కృష్ణా: బాపులపాడు మండలం కోడూరుపాడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడవ విడత నాలుగు నెలల బోనస్గా రూ.2,19,122ను ఛైర్మన్ చలసాని ఆంజనేయులు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పాడి రైతు ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించారు. పశు వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తి చేయడమే లక్ష్యమని చలసాని ఆంజనేయులు తెలిపారు.